గంగతో రాంబాబు సినిమాతో పూరీకి భారీ లాభం

 

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కొత్త సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు రాజకీయవర్గాల్లో తీవ్రస్థాయిలో కలకలం రేపింది. పూరీ ఉద్దేశపూర్వకంగా వై.ఎస్ ని నెత్తికెత్తుకుని, మిగతా పార్టీల నేతల్ని అవమానించారంటూ చాలా పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. తెలంగాణ ని అవమానించే రీతిలో ఉన్న డైలాగ్స్ ని తొలగించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే పూరీ ఈ సినిమాని తీశారంటూ చాలామంది తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పూరీ జగన్ పార్టీలో చేరబోతున్నారని, అనకాపల్లి లోక్ సభ స్థానానికి బరిలో నిలబడాలనుకుంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. పూరీ సోదరుడు గణేష్.. ఇప్పటికే వైకాపాలో యాక్టివ్ పార్ట్ పోషిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా విజయలక్ష్మి, షర్మిల పూరీ ఇంట్లోనే బసచేయడం మరో సంచలనం. వాళ్లిలా తనింటికి రావాడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేసి తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నాడు పూరీ.. వై.ఎస్ మీద అభిమానాన్ని చాటుకోవడానికే సినిమాలో ముఖ్యమంత్రికి పంచెకట్టుని సెట్ చేశారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయ్.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.