విజయ్‌ మాల్యాకి అరెస్ట్ వారెంట్

 

కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యా మరోసారి చిక్కుల్లో పడ్డారు. చెక్‌బౌన్స్ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. శంషాబాద్ విమానాశ్రయ వినియోగ రుసుంను చెల్లింకచకోవడంతో జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. జీఎంఆర్ పిర్యాదు మేరకు 13వ నగర న్యాయస్థానం విజయ్ మాల్యాకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో విజయ్‌మాల్యా కోర్టుకు హాజరుకానందుకు ఆయనపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆయనతోపాటు మరో ఐదుగురిపై హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పదమూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేస్తూ తీర్పునిచ్చారు. మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయనపై కోర్టు వారెంట్లు జారీ చేసింది. విదేశాల్లో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని మాల్యా పిటీషన్‌ దాఖలు చేసుకున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.