చేతికందని డబ్బుకి రూ.70 లక్షల పన్నుకట్టినా సైనా

 

డెక్కన్ క్రానికల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నేరుగా డబ్బుని మేనేజర్లద్వారా అకౌంట్ లో జమచేస్తానని డెక్కన్ క్రానికల్ సంస్థ సైనాతో డీల్ కుదుర్చుకుంది. కానీ.. ఇవ్వాల్సిన డబ్బు సైనా అకౌంట్లో పడనేలేదు. కానీ.. డీల్ కుదుర్చుకున్న పాపానికి తొందరపడి ముందే కూసిన సైనా నెహ్వాల్ 70 లక్షల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. ఈ ఏడాది జూలైనెలనుంచి రితీ స్పోర్ట్స్ తో మరో కాంట్రాక్ట్ ని సైన్ చేసిన సైనాకి గతంలో కుదుర్చుకున్న డెక్కన్ క్రానికల్ ఒప్పందంవల్ల ఒరిగిందేలేదు. పైగా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి ట్యాక్స్ కట్టాలంటూ నోటీస్ రావడంవల్ల తను లండన్ ఒలంపిక్స్ లో వచ్చిన ప్రైజ్ మనీ నుంచి డబ్బుని తీసి ట్యాక్స్ కట్టాల్సొచ్చిందని సైనా మేనేజర్లు చెబుతున్నారు. డెక్కన్ క్రానికల్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసి చాలాకాలంపాటు డబ్బుకోసం ఒత్తిడి చేయలేదని, కానీ తీసుకోని డబ్బుకి ట్యాక్స్ కట్టాల్సొచ్చిన విషయం తెలిసిన తర్వాతైనా డెక్కన్ క్రానికల్ గ్రూప్ సరైన రీతిలో స్పందించిఉంటే బాగుండేదని సైనా మేనేజర్లు అంటున్నారు. మరోవైపు ముంబైకి చెందిన ఓ సంస్థ డెక్కన్ చార్జర్స్ టీమ్ ని కొనేసింది. ఇప్పటికైనా సైనా బకాయిల్ని చెల్లించే ఉద్దేశం ఆ సంస్థకి కలిగితే చాలా బాగుంటుందని చాలామంది క్రీడాకారులు అనుకుంటున్నారు. పాపం.. సైనా.. సో.. పిటీ.. కదా..

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.