చేతికందని డబ్బుకి రూ.70 లక్షల పన్నుకట్టినా సైనా
posted on Oct 12, 2012 @ 4:38PM
డెక్కన్ క్రానికల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నేరుగా డబ్బుని మేనేజర్లద్వారా అకౌంట్ లో జమచేస్తానని డెక్కన్ క్రానికల్ సంస్థ సైనాతో డీల్ కుదుర్చుకుంది. కానీ.. ఇవ్వాల్సిన డబ్బు సైనా అకౌంట్లో పడనేలేదు. కానీ.. డీల్ కుదుర్చుకున్న పాపానికి తొందరపడి ముందే కూసిన సైనా నెహ్వాల్ 70 లక్షల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. ఈ ఏడాది జూలైనెలనుంచి రితీ స్పోర్ట్స్ తో మరో కాంట్రాక్ట్ ని సైన్ చేసిన సైనాకి గతంలో కుదుర్చుకున్న డెక్కన్ క్రానికల్ ఒప్పందంవల్ల ఒరిగిందేలేదు. పైగా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి ట్యాక్స్ కట్టాలంటూ నోటీస్ రావడంవల్ల తను లండన్ ఒలంపిక్స్ లో వచ్చిన ప్రైజ్ మనీ నుంచి డబ్బుని తీసి ట్యాక్స్ కట్టాల్సొచ్చిందని సైనా మేనేజర్లు చెబుతున్నారు. డెక్కన్ క్రానికల్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసి చాలాకాలంపాటు డబ్బుకోసం ఒత్తిడి చేయలేదని, కానీ తీసుకోని డబ్బుకి ట్యాక్స్ కట్టాల్సొచ్చిన విషయం తెలిసిన తర్వాతైనా డెక్కన్ క్రానికల్ గ్రూప్ సరైన రీతిలో స్పందించిఉంటే బాగుండేదని సైనా మేనేజర్లు అంటున్నారు. మరోవైపు ముంబైకి చెందిన ఓ సంస్థ డెక్కన్ చార్జర్స్ టీమ్ ని కొనేసింది. ఇప్పటికైనా సైనా బకాయిల్ని చెల్లించే ఉద్దేశం ఆ సంస్థకి కలిగితే చాలా బాగుంటుందని చాలామంది క్రీడాకారులు అనుకుంటున్నారు. పాపం.. సైనా.. సో.. పిటీ.. కదా..