మా తెలుగు తల్లికీ మల్లెపూదండ !

ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. తెలుగుతల్లి తెగ సంబరపడిపోతోంది. పలుకు తేనెలతల్లిగా ప్రసిద్ధురాలైన తెలుగుతల్లికి బిడ్డలంటే ఎంతో మమకారం. అజంతాలకు అనంతమైన మాధుర్యాన్ని కల్పించి నోరారా కమ్మగా మాట్లాడుకోగలిగిన భాగ్యాన్ని కలిగించే ఒక్కగానొక్క భాష తెలుగు భాషే. మిగతా భాషల్లో అక్షరాల చివరలు నేలకు పడిపోతాయి. ఒక్క మన తెలుగు భాషలో మాత్రం అక్షరాలు గర్వంగా నిలబడతాయి. గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతిని అధికారికంగా మనం తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాషకి పట్టంకట్టిన ఆ మహనీయుడు పుట్టిన రోజున పండగ చేసుకుంటున్నాం. వ్యవహారిక భాషను వ్యాప్తి చేయడానికి ఆయన చేసిన కృషి తెలుగువాళ్లందరికీ శ్రీరామరక్ష.  1863 ఆగస్ట్ 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో గిడుగు రామ్మూర్తి జన్మించారు. మెట్రిక్యులేషన్ పాసై బడిపంతులు ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేసుకుంటూనే ఎఫ్.ఎ, బి.ఎ పూర్తి చేశారు. మహారాజా పాఠశాల కళాశాలగా మారగానే ఉపన్యాసకుడిగా అందులో చేరారు. తర్వాతికాలంలో వ్యవహారిక భాషా ఉద్యమమే ఆయనకు ఊపిరిగా మారింది. గిడుగురామ్మూర్తికంటే ముందు చాలామంది వ్యవహారిక భాషను వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. కానీ.. వాళ్లంతా వ్యక్తిగతంగా ప్రయత్నంచేసినవాళ్లే.. గిడుగు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్యవహారిక భాష వ్యాప్తిని ఆయన ఓ ఉద్యమంగా మార్చేశారు. దానికోసం కృషి చేస్తున్నవాళ్లందర్నీ ఒక్కతాటిమీదికి తీసుకొచ్చి భాషకి పట్టంకట్టారు. అందుకే గిడుగు తెలుగు వాళ్లకీ, తెలుగు భాషని అమితంగా ప్రేమించేవాళ్లకీ ఆరాధ్యదైవంగా మారారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.