అన్నా పంచెకిందకి నీళ్లొచ్చేస్తున్నాయ్!

అన్నా హజారే టీమ్ సభ్యులు కొట్టుకు ఛస్తున్నారు. ఒకళ్లంటే ఒకళ్లకి ఏమాత్రం పడడం లేదు. విభేదాలు ఎక్కువైపోయి ఎవరిదారి వాళ్లు చూసుకుంటున్నారు. జనం కోసం మొదలుపెట్టిన ఆందోళన రాజకీయ రంగును పులుముకోవడంతో నిజంగా జనంకోసమే బరిలోకి దిగినవాళ్లు టీమ్ నుంచి విడిపోయారు. రాజకీయప్రయోజనాలకోసమే ఇదంతా చేస్తున్నారంటూ బాహాటంగానే సహచరులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

త్వరలోనే అన్నా కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అన్నా టీమ్ లో పొలిటికల్ కెరీర్ గురించి కలలుగంటున్నవాళ్ల మాటలుకూడా కొత్త పార్టీ ప్రయత్నాల్ని బలపరుస్తున్నాయ్. పార్టీ పెట్టితీరాలన్న పట్టుదలతో కేజ్రీవాల్ ముందుకు దూసుకెళ్తున్నారు. కోల్ గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపించి యూపీఏ, బీజేపీలను ఇబ్బందిపెట్టేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాల్ని ప్రభుత్వం చాకచక్యంగా అడ్డుకుంది.

కేజ్రీవాల్ స్వలాభంకోసమే పనిచేస్తున్నారంటూ కిరణ్ బేడీ ట్విట్టర్ ఇచ్చిన సందేశాలు చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. కేజ్రీవాల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం చాలా ఆనుమానాలకు తావిస్తోందని, అన్నా తక్షణం జోక్యం చేసుకుని కేజ్రీవాల్ కి మార్గనిర్దేశం చేయాలని కిరణ్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో బిజెపిని లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదని కిరణ్ గట్టిగా పట్టుబట్టారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.