తెలుగుకు పట్టంకడుతున్న తెలుగు వన్ డాట్ కామ్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందర్నీ ఒక్కటిగా నిలబెట్టాలన్న సదాశయంలో మొదలైన ఏకైక సంస్థ తెలుగువన్ డాట్ కామ్. తెలుగు భాషని, తెలుగు సంప్రదాయాన్ని, సంస్కారాన్నీ, విలువల్నీ ప్రపంచవ్యాప్తం చేయాలన్నదే మా ప్రయత్నం. తెలుగు భాషకు పట్టంకట్టేందుకు, ప్రపంచదేశాల్లో తెలుగువాళ్లని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కంకణంకట్టుకున్న ఏకైక వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్.

తెలుగువాళ్లందర్నీ ఒక్కటిగా నిలబెట్టేందుకు మేం చేస్తున్న బలీయమైన ప్రయత్నానికి టోరీ ఓ బలమైన వేదికగా నిలుస్తోంది. ప్రపంచదేశాలన్నింటినుంచి తెలుగుభాషంటే విపరీతమైన అభిమానం ఉన్న వందమంది టోరీకి ఆర్జేలుగా పనిచేస్తూ తెలుగుభాషకి, తెలుగు సంప్రదాయాలకూ అతి విలువైన సేవలందిస్తున్నారు.

తెలుగు భాషకి పట్టంకడుతున్న తొలి తెలుగు వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్. తెలుగు భాషను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అంతర్జాలంలో వచ్చిన తొలి వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్. ప్రపంచదేశాల్లోఉన్న తెలుగువాళ్లంతా అత్మీయానురాగాల్ని కురిపిస్తూ అక్కున చేర్చుకున్న తొట్టతొలి వెబ్ సైట్ తెలుగువన్ డాట్ కామ్..

ఇప్పటికీ, ఎప్పటికీ మా లక్ష్యం ఒక్కటే తెలుగువాళ్లంతా చల్లగా ఉండాలి. తెలుగు నేలపై పుట్టినవాళ్లంతా ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కటిగానే ఉండాలి. తెలుగుతల్లి ప్రాభవాన్ని దశదిశలా చాటాలి. తెలుగువాళ్ల సత్తాని ప్రపంచానికి రుచిచూపించాలి. తెలుగు పలుకులో ఉన్న తియ్యదనాన్ని తెలుగుబిడ్డలంతా ఆనందంగా అనుభవించాలి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.