తెలంగాణపై త్వరలో నిర్ణయం
posted on Sep 23, 2012 @ 10:58AM
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించిన తర్వాత, కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని సీఎం చెప్పారు. కేంద్రం ఎప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న తేదీ, సమయాలను తాను చెప్పలేనన్నారు.ఎప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న తేదీ, సమయాలను తాను చెప్పలేనన్నారు. "తెలంగాణ కఠినమైన, సున్నితమైన అంశం. దీనిపై నిర్ణయం తీసుకోవడం సులువు కాదు. నిర్ణయం తీసుకునేముందు అందరితోనూ మాట్లాడాలి. దీనిపై కాంగ్రెస్ నేతలతోనూ మాట్లాడాలి. కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే యత్నాన్ని కేంద్రం చేస్తుంది. అందరితో మాట్లాడాకే కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది'' అని వివరించారు. తుది నిర్ణయం తీసుకునే సమయంలో సీఎంగా తన అభిప్రాయాన్ని అధిష్ఠానం తెలుసుకుంటుందని, తన అభిప్రాయాన్ని కోరితే తప్పకుండా చెబుతానని కిరణ్ వివరించారు.