ఇంత కన్నా దిగజారుడుతనం ఉంటుందా?
Publish Date:Apr 25, 2024
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
ఆ తరువాత తల్లినీ చెల్లినీ దూరం నెట్టేసి ఈయనకు బంధుత్వాలు, అనుబంధాలూ కూడా లేవా అని జనం ముక్కున వేలేసుకునేలా చేశారు. సరే ఎవో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు అనుకుంటే.. షర్మల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆమెను టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిత్వ హననానికి సొంత సోషల్ మీడియా పాల్పడినా పట్టించుకోకుండా జగన్ తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు.
ఇక ఇప్పుడు పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం ఒక మనిషి ఇంత దిగజారగలడా అని ఆయన ప్రత్యర్థులు సైతం ఆశ్చర్య పడేలా చేసింది. తన ప్రసంగంలో జగన్ షర్మిల కట్టుకున్న చీరను సైతం ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.
షర్మిల పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా తప్పుపడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ లెవల్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పసుపు చీర కట్టుకున్న షర్మిల వైఎస్ వారసురాలు కాదు అని అర్ధం వచ్చేలా జగన్ మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని, ఆయనకు రక్షణగా నిలిచి పార్టీ టికెట్ ఇచ్చిన జగనా వైఎస్ వారసత్వం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా షర్మిల కట్టుకున్న చీరను సైతం జగన్ తప్పుపడ్డడాన్ని, వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. ఇక కొందరు నెటిజనులైతే జగన్ భార్య భారతి పసుపు చీర కట్టుకుని ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తూ.. భార్యపైన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగలవా జగన్ అ ంటూ సవాల్ చేస్తున్నారు.
అవినాష్ పాపం చిన్న పిల్లోడంట!
Publish Date:Apr 25, 2024
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం
Publish Date:Apr 25, 2024
జగన్ కు సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ? వైసీపీ మైండ్ బ్లాక్
Publish Date:Apr 25, 2024
బెజవాడ సెంట్రల్ బరిలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల
Publish Date:Apr 25, 2024
మనిషి జీవితంలో గురువు ప్రాధాన్యత తెలిపే కథనం!!
Publish Date:Oct 9, 2023
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
80 ఏళ్లకు గమ్యం చేరిన పెయింటింగ్!
Publish Date:Jun 19, 2022
పవార్ సారథ్యంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్?
Publish Date:Mar 17, 2021
బడ్జెట్ రెడీ సంక్షేమానికి పెద్ద పీట?
Publish Date:Mar 16, 2021
ప్రచారం ముగిసింది.. ఇక పోరాటం మిగిలింది..
Publish Date:Mar 12, 2021
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
Publish Date:Mar 15, 2021
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.
41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
2 వేల నోటు ఇక ఉండదా!
Publish Date:Mar 15, 2021
బీజేపీ నోటాను బీట్ చేసింది...
Publish Date:Mar 15, 2021
స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఖర్చు 10 వేల కోట్లు!
Publish Date:Mar 15, 2021
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దేనా..?
Publish Date:Mar 15, 2021
భార్యలు భర్తల నుండి ఏం కోరుకుంటారు...బంధం దృఢంగా ఉండటానికి ఏది ముఖ్యం?
Publish Date:Apr 25, 2024
విజయవంతమైన, సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం కాదు. బంధంలో భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి. అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి. బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు. భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం, అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది. ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే..
ప్రేమ..
ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ, ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది.
శ్రద్ద..
ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం. భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం, ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం.. ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు.
గౌరవం..
ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని, తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు
కమ్యూనికేషన్..
భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని, జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో ఒకరికొకరు నిజాయితీగా, మంచి నమ్మకంతో కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు. ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది.
అవగాహన..
భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు, అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.
*నిశ్శబ్ద.
భార్యాభర్తలలో ఉండే ఈ అలవాట్లు ఏకంగా విడిపోవడానికి దారితీస్తాయ్!
Publish Date:Apr 24, 2024
పిల్లలు బాగా ఎమోషన్ అవుతున్నారా? ఇలా హ్యాండిల్ చేయండి!
Publish Date:Apr 23, 2024
పరులకు ఉపకారం చెయ్యడం ఎందుకంత గొప్ప??
Publish Date:Apr 22, 2024
లక్ష్యానికి అండర్ లైన్ చేసుకోండి...
Publish Date:Apr 20, 2024
యాపిల్ సైడర్ వెనిగర్ గురించి ఈ విషయాలు తెలుసా?
Publish Date:Apr 25, 2024
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట. యాపిల్ లో ఉండే పోషకాలే దీనికి కారణం. అయితే ఈ మధ్య యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పాపులర్ అయింది. దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరైనా కొత్తగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడే ఆలోచనలో ఉన్నా, దీని గురించి పూర్తీగా తెలియకున్నా ... దీని గురించి తప్పక తెలుసుకుని వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ముందు అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటో.. దీన్ని వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..
మధుమేహ రోగులకు..
యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యుల సలహా తీసుకుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.
బరువు..
యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గాలని అనుకునేవారికి ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని రోజువారీ వాడుతుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది.
గుండె ఆరోగ్యం..
చెడు కొలెస్ట్రాల్ సమస్య అయినా, రక్తపోటును నియంత్రించడం అయినా.. ఆపిల్ సైడర్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన చాలా సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే మూలకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చర్మ ఆరోగ్యం..
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మం దురద, ఎరుపు, చర్మ అంటువ్యాధులు మొదలైన సమస్యలలో బ్యాక్టీరియాను చంపడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఎలా తీసుకోవాలి..
యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించడానికి ఒక కరెక్ట్ కొలత వాడాలి. ప్రతిరోజూ ఇంతే మోతాదులో తీసుకోవాలి. 5-10 ml మోతాదుతో మాత్రమే ప్రారంభించాలి. ఒక గ్లాసు తీసుకుని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. గ్లాసు నిండుగా నీరు తీసుకోవాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
*రూపశ్రీ.
మామిడిపండ్లను తినేముందు నీటిలో కొద్దిసేపు ఉంచి తినాలి ఎందుకో తెలుసా?
Publish Date:Apr 24, 2024
నిద్రలో ఎప్పుడైనా నరాలు లాగేస్తుంటాయా? కారణాలు ఇవే కావచ్చు!
Publish Date:Apr 23, 2024
రోగాలు రాకుండా చూసుకోవడం ఎలా ?
Publish Date:Apr 22, 2024
వేసవికాలం డయాబెటిస్ రోగులకు ప్రమాదమా?
Publish Date:Apr 20, 2024
కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం
Publish Date:Jul 17, 2020
సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి.
రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది.
కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
జియో గ్లాస్ ఫీచర్స్
- నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే.
- ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు.
- ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు.
- ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది.
- హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు.
- ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు.
- అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది.
- జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.
YouTube Premium and Music services launched in India, starts at Rs 99 per month
Publish Date:Mar 13, 2019
Your WhatsApp account will be deactivated if you use these apps
Publish Date:Mar 11, 2019
Best phones under 20,000 in 2019
Publish Date:Mar 9, 2019
Google introduces educational app Bolo to improve children’s literacy in India
Publish Date:Mar 6, 2019