సూపర్ ఓవర్లో శ్రీలంక సూపర్ విక్టరీ

 

 

గురువారం జరిగిన సూపర్-8, టి-20 ప్రపంచ కప్‌ మ్యాచ్ లోజరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో శ్రీలంక కివీస్ పై సూపర్ విక్టరి సాధి౦చింది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక ఒక వికెట్‌కు 13 పరుగులు చేయగా, న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి ఆరు పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 174 పరుగులు చేసింది. నికోల్ 40 బంతు ల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, గుప్టిల్ 30 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేయగా, బ్రెండన్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 25, టేలర్ 15 బంతుల్లో 2 ఫోర్లతో 23 దూకుడుగా ఆడారు. అనంతరం 175 పరుగుల లక్ష్యఛేధనలో లంకేయులు పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులే చేసింది. ది ల్షాన్ 53 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు, మహేల 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 మెరుపులు మెరిపించారు. ఓ దశలో లంక సునాయాసంగా విజయం సా ధించేలా కనిపించినా చివరకు ఉత్కంఠకు దారితీసింది. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.