భద్రకాళిగా మారిన సోనియా

బొగ్గు కుంభకోణం స్కామ్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న బిజేపీ ఉభయసభల్లో తన ప్రతాపాన్ని చూపించింది. ప్రథాని రాజీనామాకోసం పట్టుబట్టి ఉభయసభల్ని స్తంభింపజేసింది. సోనియాకి, ప్రథానికి ఊపిరాడని పరిస్థితిని కల్పించి పై చేయి సాధించడం ప్రథాన ప్రతిపక్షం వ్యూహం ..

ప్రతిపక్షపార్టీ సిద్ధం చేసుకున్న వ్యూహం పూర్తిగా తలకిందులైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బిజేపీ చేసిన ప్రయత్నాలు ఈ సారి అంతగా పారినట్టు కనిపించలేదు. ఎందుకంటే సోనియా దగ్గరుండి మరీ తమ ఎంపీలతో బీజేపీ ఎంపీలమీద ఎదురుదాడి చేయించారు. గెలవాలంటే నియమాలను పక్కనపెట్టేయక తప్పదనే సూత్రాన్ని స్పష్టంగా పాటించారు.

అధికార పక్షం.. మేమేమీ తక్కువ తినలేదన్న రీతిలో విరుచుకుపడింది. యూపీఏ ఎంపీలందరినీ సోనియా ఒక్కతాటిమీద నడిపించారు. ప్రత్యర్ధులు ఖంగుతినే రీతిలో ఎదురుదాడి చేయించారు. సభలో సోనియా దగ్గరుండి తమ ఎంపీల్ని బీజేపీ నేతలమీదికి ఉసిగొలపడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా ఆవేశంగా ప్రసంగించారు. తమ పార్టీ ఎంపీలకు ధైర్యాన్ని నూరిపోశారు. కిందపడ్డా మనదే పై చేయి కావాలంటూ అదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.