శంకర్రావుకి సంకెళ్లు తప్పవా?

 

కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావుకి కూడా త్వరలోనే కారాగారవాసం పట్టే యోగం కనిపిస్తోంది. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకరన్న పై ఉన్న అరెస్ట్ వారెంట్ లపై ఉన్న స్టేని హైకోర్ట్ ఎత్తేసింది. అల్వాల్ మునిసిపాలిటీ పరిధిలోఉన్న కనాజీగూడ గ్రామంలో 875 ప్లాట్లని రెగ్యులరైజ్ చేసే విషయంలో శంకరన్న చేతివాటం ప్రదర్శించే ప్రయత్నం చేశాడని ఆయనపై అభియోగం. గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ అసోసియేషన్ కి చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు శంకర్రావు ప్రయత్నించారంటూ గతంలో సైబారాబాద్ పోలీస్టేషన్ పరిధిలో ఆయనపై ఓ కేసు నమోదయ్యింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే నేరంపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. శంకర్రావు అప్పట్లో హైకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. హైకోర్ట్ పునఃసమీక్ష జరిపి వారెంట్ ని ఎత్తేయడంతో మాజీమంత్రివర్యులు శంకర్రావుని, ఆయన కొడుకు దయానంద్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. విచారణలో సహకరించకపోతే వెంటనే సైబారాబాద్ పోలీసులు వాళ్లని అరెస్ట్ చేయొచ్చు. ఈ కేసునుంచి బైటపడేందుకు శంకర్రావు సుప్రీంకోర్ట్ గడపతొక్కబోతున్నారని సమాచారం.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.