కరీనా సైఫ్ జంటకి పెటా వెజ్ చాక్లెట్

 

బాలీవుడ్ కొత్త జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లకు ముంబైలోని జంతుహక్కుల పరిరక్షణ సంస్థ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఏనిమల్స్ ప్రత్యేకంగా ఓ కానుకను సిద్ధం చేసింది. శాఖాహార పదార్ధాలతో మాత్రమే తయారుచేసే వెగన్ ఛాక్లెట్ చికెన్స్ ని కొత్త దంపతులకు పెటా సంస్థ.. కానుకగా పంపిస్తోంది. కరీనా పూర్తిగా శాఖాహారి కనుక ఈ కానుకనివ్వడం చాలా బాగుంటుందని పెటా సభ్యులు భావిస్తున్నారు. బాంద్రా ఏరియాలో ఉన్న సైఫ్ ఇంట్లోనే కరీనా, సయీఫ్ ల వివహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ముందుగానే దరఖాస్తు చేసుకోవడంవల్ల రిజిస్ట్రార్ కూడా ఇంటికే వచ్చి పెళ్లిని నమోదుచేసుకున్నారు. లాంఛనాలు పూర్తి కాగానే నూతన దంపతులు ఇంటి బాల్కనీలోకొచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ రిజిస్టర్డ్‌ మ్యారేజీకి కరీనా తల్లిదండ్రులు బబిత, రణ్‌ధీర్‌ కపూర్‌, సైఫ్‌ తల్లి షర్మిలా ఠాగూర్‌ సాక్షులుగా సంతకం చేశారు. షారుఖ్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, తుషార్‌ కపూర్‌, అమృతా అరోరా లాంటి నటీనటులు వివాహ వేడుకకు హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.