“ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా“కి టెండూల్కర్ అర్హుడేనా?

 

ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని సచిన్ టెండూల్కర్ కివ్వడం సమంజసం కాదంటూ అక్కడి క్రికెట్ అభిమానులు, అభిమాన సంఘాలు మండిపడుతున్నాయ్. ఈ విషయంమీద ఆందోళన జరిపేందుకుకూడా అక్కడివాళ్లు సిద్ధమౌతున్నారు. గతంలో సిడ్నీ టెస్ట్ సందర్భంగా తలెత్తిన జాతి వివక్ష వ్యాఖ్యల వివాదంలో ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కి వ్యతిరేకంగా మాట్లాడ్డమేకాక, తోటి క్రీడాకారుడు హర్భజన్ సింగ్ ని వెనకేసుకొచ్చిన సచిన్ కి అంతటి ఉన్నత పురస్కారమివ్వడం అస్ట్రేలియాలో చాలామంది క్రికెట్ అభిమానులకు రుచించడంలేదు. ఆసీస్ ప్రథాని గిలార్డ్ నుంచి ప్రకటన వెలువడిన మరు క్షణమే ఆస్ట్రేలియా పత్రిక హెరాల్డ్ సన్ తన వెబ్ సైట్ లో ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. సచిన్ కి మద్దతుగా దాదాపు 45 శాతం ఓట్లు పోలైతే, వ్యతిరేకంగా 56 శాతం ఓట్లు పోలయ్యాయి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.