గృహలక్ష్మి పథకం రద్దు.. ఇందిరమ్మ ఇళ్ల కు దరఖాస్తుల స్వీకరణ
posted on Jan 3, 2024 @ 1:27PM
తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం (జనవరి 2) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే స్తోమత లేని పేదవారికి ఇంటికి మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని గత తెరాస ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను రేవంత్ సర్కార్ రద్దు చేసింది.
ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు ఉత్తర్వులు జారీ చేశారు. గృహ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 2,12,095 కుటుంబాలకు జారీ అయిన శాంక్షన్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. గృహ లక్ష్మీ పథకం స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది.
ఇందు కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున సాయం అందించనున్నది.