రామ్ దేవ్ బాబా ఆశ్రమంపై మెరుపుదాడి
posted on Sep 26, 2012 @ 1:55PM
హరిద్వార్ లోని రామ్ దేవ్ బాబా పతంజలి యోగాపీఠంమీద హఠాత్తుగా దాడి జరిగింది. అధికారులు చకచకా లోపలికి చొరబడ్డారు. అక్కడ తయారవుతున్న మందుల్ని తీసుకుని ల్యాబ్ లో టెస్ట్ చేయించారు. వాటిలో ఏమాత్రం నాణ్యత లేదని తేల్చేశారు. ఎక్కడో తయారుచేసిన ఉత్పత్తుల్ని పతంజలి ఆశ్రమానికి తీసుకొచ్చి అమ్ముతున్నారని, జనాన్ని మోసం చేస్తున్నారని అభియోగాలు నమోదయ్యాయి. మూడురోజుల్లోగా వివరణ కోరుతూ రామ్ దేవ్ బాబా పీఠానికి నోటీసులు జారీ చేశారు. యూపీయే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బాహాటంగా విమర్శిస్తున్నందుకు, అవినీతిపై ప్రత్యక్ష పోరుకి దిగినందుకే తనపై కేంద్ర సర్కారు ఇలా కక్ష సాధిస్తోందని రామ్ దేవ్ బాబా ఆరోపిస్తున్నారు. పాపం రామ్ దేవ్.. ఇప్పుడాయన చేయగలిగిందికూడా అంతకంటే ఏం లేదుగా మరి..