జగన్‌ను పలకరించడానికి ఇష్టపడని ఎంపీలు

న్యూఢిల్లీ: పార్లమెంటుకు వచ్చిన  వైయస్సార్ కాంగ్రెసు లోకసభ సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పలకరింపులు కూడా కరవయ్యాయి కనిసం  దగ్గరకు రావడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. జగన్ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో చాలాసేపు మాట్లాడుతూ కాలం గడిపారు. తన వర్గం ఎంపీ సబ్బం హరితో కొద్దిసేపు ఉన్నారు. ఆ తర్వాత సబ్బంను ఇంటికి పంపి, జగన్ సభలో ఉన్నారు. జగన్‌ను చేరదీసినా, ఆయన తరఫున మధ్యవర్తిత్వం వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ పెద్దలు హెచ్చరించడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. కాగా, సోనియా, రాహుల్ గాంధీలాంటి నేతలతో మాట్లాడే ధైర్యం లేని జగన్ వర్గీయులు - ఒక గవర్నర్ ద్వారా, కేంద్రంలో ఒకరిద్దరు మంత్రుల ద్వారా మధ్యవర్తిత్వ యత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే, ముందు పార్టీని రద్దు చేసుకోవాలని చెప్పండని వారు మధ్యవర్తులకు చెప్పారని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది. దాంతో మధ్యవర్తులు నోరు మూసుకున్నారని చెబుతున్నారు.
 

Teluguone gnews banner