మద్యం సిండికేట్ల స్కాంపై సీఎంకు ఎసిబి కీలకనివేదిక

హైదరాబాద్: మద్యం వ్యాపారులపై ఇటీవల జరిపిన ఆకస్మిక దాడులలో బయటపడిన ఆధారాల ప్రాతిపదికగా తయారు చేసిన ఒక కీలకమైన నివేదికను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అదనపు డైరెక్టర్ జనరల్ భూపతిబాబు సోమవారం సాయంత్రం ముఖమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి అందజేసినట్టు తెలుస్తున్నది. ఈ నివేదికలో ఏముందనేది తీవ్రమైన ఉత్కంఠ కలిగిస్తున్నది. అక్రమ మద్యం అమ్మకాలు పెద్ద కుంభకోణంగా మారినట్టు ఈ దాడులలో బయటపడిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కొందరు పాత్రికేయులకు సైతం అక్రమ మద్యం విక్రయాల కుంభకోణంలో మామూళ్లు కోట్లలో ముట్టినట్టు ఎసిబికి గట్టి ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. ఈ వివరాలనే భూపతిబాబు నేటి సమావేశంలో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్టు తెలుస్త్తోంది.

Teluguone gnews banner