నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

 

కాంగ్రెస్ లో పదవుల పందేరానికి రంగం సిద్ధమయ్యింది. చాలాకాలంగా నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలు భారీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు. కేబినెట్ విస్తరణకు నో చెప్పిన హై కమాండ్ నామినేటెడ్ పోస్ట్ ల భర్తీకి సరే అనడంతో చాలామంది గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రథానితో ఈ విషయంలో గట్టిగానే మాట్లాడి మాట తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. వై.ఎస్ తొలిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు కొంతమందికి కొన్ని పదవులు ఇచ్చారు. తర్వాతికాలంలో నామినేటెడ్ పోస్ట్ ల ఊసే లేదు. రెండోసారి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాకకూడా ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ పోస్టుల వ్యవహారాన్ని పరిశీలించనేలేదు. రోశయ్య సీఎం అయ్యాక కొంతమందికి ఛాన్స్ దక్కింది. కిరణ్ సీఎం కుర్చీలో కూర్చున్నతర్వాత ఇంతవరకూ నామినేటెడ్ పోస్ట్ ల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇన్నాళ్లుగా నానుతూ వచ్చిన వ్యవహారంమీద ఓ క్లారిటీ కనిపిస్తోందని పార్టీ నేతలు అనుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.