క్యాబినేట్ మార్చక్కర్లేదు నామినేటెడ్ పోస్టులిస్తేచాలు
posted on Oct 18, 2012 @ 12:07PM
ముఖ్యమంత్రి డిల్లీలో జరిపిన సుడిగాలి పర్యటనలో ఖరారయిన విషయం ఏమంటే ఇప్పుడున్న క్యాబినేట్ ను మార్చనక్కర్లేదని, నామినేటెడ్ పోస్టులిస్తేచాలంటూ 45 పేర్లను తమ వెంట తీసుకెళ్లారు. మొదట గులాంనబీ ఆజాద్ ను కలుసుకున్నారు. రాష్ట్రరాజకీయాలను ఏకరువు పెట్టారు. సోనియా గాంధీతో గంటకు పైగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రివద్ద ఉన్న 45 పేర్లజాబితాలో కొన్నింటిని మాత్రమే అధినేత్రి ఆమోదించారని తెలుస్తుంది. మరికొన్ని సమన్యయ కమిటీలోనిని, మరికొన్ని పార్టీ వర్గాల ద్వారా తెప్పించుకున్న పేర్లు ఇచ్చారు. దీంతో సరికొత్త జాబితా తయారు చేయవలసిందని సోనియా ముఖ్యమంత్రిని కోరారు. జాబాతా విషయమై బొత్సతో చర్చించాల్సిందిగా అహ్మద్ పటేల్ సూచించారు. ధర్మాన రాజీనామా వ్యవహారంతోపాటు మరికొందరి మంత్రుల సుప్రీంకోర్టు నోటీసుల గురించి ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వీటితో పాటు తెలంగాణ అంశం కూడా సోనియా ముందుంచారు. తగిన సమయంలో దానిపై నిర్ణయం తీసుకుంటామని సోనియా చెప్పారు. రాహుల్ ఆంద్ర ప్రదేశ్ పై ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రరాజకీయాలను పూర్తిగా వివరించారు. రాహుల్ కోరిక మేరకు యువతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. షిండే తోనూ వాయిలార్ రవితోనూ తెలంగాణ పోరు, ప్రస్తుతం తెలంగాణ ఎంపీల తీరు తెన్నులు, ప్రధాని జీవవైవిద్య సదస్సుకు హాజరైన సందర్బంలో తెలంగాణ మీడియా కు అనుమతి నివారణ దానిపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడం మొదలైన వివ రాలను వారిరువురీ మద్యవుంచారు. రాష్ట్రానికి పనికి వచ్చే విద్యుత్ విషయం మాత్రం మొయిలీతో సుదీర్ఘంగా వివరించారు. రైతులకు కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించ లేక పోతున్నామని దీనివల్ల ప్రజల్లో చులకనయిపోతున్నామని, ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని వెంటనే విద్యుత్ కెటాయించి ఆదుకోవాలని మొయిలీని కోరారు