మంత్రి పార్ధసారధికి నాన్బెయిలబుల్ వారెంట్
posted on Jul 23, 2012 @ 4:56PM
నాంపల్లి కోర్టు మంత్రి పార్ధసారధికి నాన్బెయిలబుల్ వారెంట్ జారి చేసింది. 2002లో మంత్రి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2003లో మూడు లక్షల రూపాయల జరిమానా విధించారు. ఆ జరీమానాని మంత్రి పార్థసారధి చెల్లించలేదు. అంతే కాకుండా కోర్టు వాయిదాలకు కూడా ఆయన హాజరుకాలేదు. దాంతో కోర్టు వారెంట్ జారీ చేసింది.