జగన్ చెబితే ఇక్కడికి వచ్చా: విజయమ్మ
posted on Jul 23, 2012 @ 4:28PM
సిరిసిల్ల చేనేత దీక్షాలో విజయమ్మ మాట్లాడుతూ సిరిసిల్లలోని నేతన్నలను ఓదార్చమని జగన్మోహన రెడ్డి చెబితే తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అయి సువర్ణ యుగం తీసుకువస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆప్పుడు చేనేత కార్మికుల కోసం జగన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు. కేంత్ర ప్రభుత్వ విధానాలతో రైతులు, చేనేత కార్మికులు అల్లాడుతున్నారని చెప్పారు. చేనేత వస్త్రాలంటే రాజశేఖర రెడ్డికి ఇష్టం అని, ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచివేసిందని విమర్శించారు.