హీనా రబ్బానీ ఖర్‌ లవ్‌ఎఫైర్

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌, పిపిపి నేత బిలావల్ భుట్టోతో ప్రేమ వ్యవహారం నడుపుతోందని బంగ్లాదేశ్ వారపత్రిక బ్లిట్జ్ ప్రచురించింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం అక్రమంగా ప్రేమ వ్యవహారం నడిపితే శిక్షార్హమేనని రాసింది. వివాహేతర సంబంధం ప్రచారం నేపథ్యంలో హీనాను జర్దారీ విదేశాంగ బాధ్యతల నుండి తొలగించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, బిలావల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు గాను దేశ విదేశాంగ మంత్రిత్వ బాధ్యతల నుంచి హీనా రబ్బానీ ఖర్‌ను తక్షణం తొలగించాలని దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని ఇస్లామిస్ట్ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.

 

 

ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లిన పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో పాటుగా విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఉన్నారు. ఇదిలావుండగా, తన భార్య హీనాకు, పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టోకు మధ్య రహస్య ప్రేమాయణం సాగుతున్నట్టు పత్రికలతో పాటు.. ఇంటర్నెట్ సమాజంలో వచ్చిన వార్తలను ఆమె భర్త, పారిశ్రామికవేత్త ఫిరోజ్ గుల్జర్ తీవ్రంగా ఖండించారు. 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.