హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకలు

 

 

హైదరాబాద్ జంటనగరాలలో గణేష్ మహారాజులు నిమజ్జనానికి కదిలాయి. పదకొండు రోజులు పాటు వేశేష పూజలందుకున్న గణనాథుడు శోభాయాత్ర పాతబస్తీ నుంచి ప్రారంభమైంది. బ్యాండుబాజాలు, భక్తుల కేరింతలు నృత్యాల మధ్య ఊరేగింపులు జరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ కేంద్ర బిందువు అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని 22 చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. కాప్రా చెరువు, సరూర్‌నగర్ ట్యాంక్, రాజన్నబౌలి, మీరాలం ట్యాంక్, పల్లెచెరువు, ఎర్రగుంట, దుర్గం చెరువు, పాపిరెడ్డి చెరువు, నల్లచెరువు, గంగారం చెరువు, హఫీజ్‌పేట చెరువు, పటాన్‌చెరువు, ఐడియల్ ట్యాంక్, సున్నం చెరువు, హన్మత్‌పేట చెరువు, ప్రగతినగర్ చెరువు, సూరారం చెరువు, వెన్నెలగడ్డ చెరువు, చిన్నరాయుని చెరువు, పెద్ద రాయుని చెరువు, ఆస్మాన్ ట్యాంక్, సఫీగుడా చెరువుల్లో గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. దాదాపు 50 వేల విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ గణేషుడి ఊరేగింపు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభంకానుంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.