వరద గోదావరితో లంక గ్రామాలకు ముప్పు

మొన్నటిదాకా ఇసుక దిబ్బలతో కనిపించిన గోదావరి ఇప్పుడు ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. బుధవారం ఉదయం కాటన్ బ్యారేజీ వద్ద 10.7 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 12.30 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తివేసి 11, 21, 300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. అలాగే జిలా యంత్రాంగం అధికారులను, నదీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేసింది, దేవీపట్నం మండలంలోని కొండమొదలు ప్రాంతాలలోని 33 గ్రామాలకు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. రాజమండ్రి సమీపంలోని లంక గ్రామాలోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కోనసీమ పరిథిలోని 24 లంక గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగం కలక్టరేట్, ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లకు ప్రారంభించింది.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.