అమ్మాయిని నగ్నంగా వీడియో తీసిన దుండగులు

గౌహతిలో జరిగిన దారుణం మరిచిపోక ముందే మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. ప్రేమికుడి ముందే ప్రియురాలిని వివస్త్రను చేసిన దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. శనివారం నరసన్నపేట ప్రాంతం నుంచి భావనపాడు సాగర తీరానికి వచ్చిన ప్రేమ జంటపై స్థానికులైన ఆకతాయిలు  ప్రేమజంట పట్ల దుర్మగంగా ప్రవర్తించారు. ప్రియుడిని కొట్టి చెట్టుకు కట్టేసి, అతని ఎదుటే ప్రియురాలిని నగ్నంగా చేసి రాక్షసానందం పొందారు.

 

 

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలోని భావనపాడులో ఈ ఘటన జరిగింది. ఆ జంట తెచ్చిన సెల్ ఫోన్‌, డబ్బులు తీసుకొని ఆ ఫోన్‌తోనే ఆమెను వీడియో తీశారు. కొంచెం సేపు తరుట యువతి వారి నుంది తప్పించుకొని నగ్నంగా సమీప గ్రామంలోకి పరుగులు తీసింది. యువతిని గమనించిన కొందరు మహిళలు ఆమెకు ఆశ్రయమిచ్చి,  సమాచారంతో గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకొనేసరికి దుండగులు అక్కడి నుండి పారిపోయారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

 

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.