ఫ్రాన్స్ లో పెళ్లి చేసుకున్నోళ్లకి పిల్లలు పుట్టరా?

ఫ్రాన్స్‌ దేశంలో ఇకమీదట అధికారిక పత్రాల్లో పేరెంట్స్‌అనే పదాన్ని మాత్రమే వాడనున్నారు. ఫ్రాన్స్‌ దేశవ్యాప్తంగా స్వలింగ సంప్కరులు అధికమై గేమ్యారేజీలు పెరగటంతో అక్కడి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో అన్ని వివాహ వేడుకల్లో పేరెంట్స్‌8 అనే పదాన్ని మాత్రమే వినియోగిస్తారు. పిల్లలను దత్తత తీసుకునే హక్కులు సైతం ఆడమగ జంటకు, గే జంటకు సమానంగా ఉంటాయని పేర్కొంది. సృష్టి విరుద్ధంగా ఏం జరిగినా అదేదో ఘనకార్యమని కొందరు దానికి మద్దతు ఇవ్వడం, ఆపైన దాన్ని మరికొందరు అనుసరించడం.. చివరకు సంక్షోభం దిశగా అది అడుగులేసినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు కళ్లు తెరచి నివారణ చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇది ఇంచుమించుగా ప్రతి దేశంలో జరిగే తంతే. ‘గేవంటి ప్రకృతి విరుద్ధ ధర్మాలకు మద్దతు నిచ్చే వ్యక్తులు ఇకనైనా అటువంటి వాటిపై పూర్తిగా ఆలోచించి, అవగాహన చేసుకుని తమ తమ మద్దతును తెలిపితే బావుంటుంది. లేదంటే ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరుగుతున్నదే.. రేపు మరో దేశంలో జరగవచ్చు.!

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.