రాజకీయపార్టీల్ని టిజెఎసి శాసించగలదా?

హైదరాబాద్ అట్టుడుకుతోంది ... జనంలో ఏదో తెలియని భయం ... తెలంగాణా మార్చ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందోనని అనుమానాలు ... "సాగారహారం'' హింసాహారంగా మారితే ఏమైనా జరగచ్చు. తెలంగాణాపేరుతొ ఉద్యమం పేరుతొ, కడుపుమంట పేరుతొ, ఆస్తులను ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగోట్టడం, బస్సులు తగలబెట్టడం లాంటి చర్యలు నిత్యకృత్యాలైపోవడంతో చాలామంది ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. మీ స్వేచ్చకోసం మా స్వేచ్చను మా శాంతిని హరిస్తారా అంటూ చాలామంది మండిపడుతున్నారు. అందుకే పోలీసులు సైతం తెలంగాణా మార్చ్ కి అనుమతి ఇవ్వలేదు. ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసారు. పర్మిషన్ ఉన్నా లేకున్నా పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణా మార్చ్ ని జరిపి సత్తాను చాటుతామని టిజెఎసి అధ్యక్షుడు కోదండరామ్ అంటున్నారు. 'సాగరహారం' కార్యక్రమానికి అనుమతి ఇస్తే వచ్చే ఇబ్బంది ఏంటి? వినాయక నిమజ్జనం, జీవవైవిధ్య సదస్సులకు మధ్య రోజు జరుగుతున్న సాగర హారం నిరసన కార్యక్రమం వల్ల ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం, పోలీసుల భావన. ఇంతవరకు అయితే పెద్ద నష్టం ఉండదు. కాని ఒకసారి అనుమతి ఇస్తే, ఆందోళనకారులు హుస్సేన్ సాగర్ చుట్టూరా ఉండి రెండు రోజులపాటు కదలకపోతే వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడం పోలీసులకు కష్టం అవుతుంది. సదస్సు జరిగే రోజు కూడా వీరి నిరసన కొనసాగితే హైదరాబాద్ ప్రతిష్ట మంట కలుస్తుంది. గతేడాది జెఎసి నిర్వహించిన మిలియన్ మార్చ్ కూడా అవాంఛనీయ ఘటనలతోనే ముగిసింది. టాంక్ బండ్ పై విగ్రహాలను కూల్చివేసి కలకలం సృష్టించారు. తెలంగాణవాదులుగా పేరొందిన నేతలు మధుయాష్కి, కె.కేశవరావులపైనే నిరసనకారులు దాడి చేశారు. ఒకసారి అది చేయి దాటిపోతే ఏ మలుపు అయినా తిరగవచ్చనడానికి ఇదే ఉదాహరణ. అంతేకాక భావోద్రేకాలు పెచ్చుమీరిన సమయంలో టాంక్ బండ్, హుస్సేన్ సాగర్ వంటి ప్రదేశాలు ఎంతవరకు నిరసనలకు అనువైనవి అన్న చర్చ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణాపై ఒక ప్రకటన చేయమని టిజెఎసి పట్టుబడుతోంది. అవన్నీ తరువాత మాట్లాడుకుందాం ముందు మార్చ్ ను వాయిదా వేయమని ప్రభుత్వం అంటోంది. చివరికి ఎం జరుగుతుందో వేచి చూద్దాం.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.