యూనిట్ కు 70 పైసలు పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

 

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలు, నిరాహార దీక్షలు, బంద్ లతో కాస్త వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి యూనిట్ కు 70 పైసలు చొప్పున వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈ.ఆర్.సి.) ప్రస్తుత చైర్మన్ రఘోత్తమరావు ఈ నెల 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగానే విద్యుత్ ఛార్జీల పెంపు తీర్పు రాబోతోంది. సర్ ఛార్జీ (ఎఫ్.ఎన్.ఏ.) పేరిట ఈ.ఆర్.సి. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో అక్టోబరు, నవంబరు, డిసెంబరు(త్రైమాసికం)లో వాడిన విద్యుత్ కు ఒక్కొక్క యూనిట్ కు 70 పైసలు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తం 850కోట్ల రూపాయలు సర్ ఛార్జీని ఈ.ఆర్.సి. విధించాబోతోంది. డిస్కంలు 1098కోట్ల రూపాయల ఇంధన సర్ ఛార్జీ వసూలుకు అనుమతి కోరాయి. దీని వసూలు జూన్ నెల బిల్లు నుంచి ఆగస్టు బిల్లు వరకు ఉంటుందని ఈ.ఆర్.సి. వసూలు చేసేందుకు సిద్ధమైంది.

Teluguone gnews banner