డీఎస్సీ ఫలితాలు విడుదల
posted on Oct 7, 2012 @ 1:29PM
డీఎస్సీ 2012 రాత పరీక్షల ఫలితాలను సచివాలయంలో మాథ్యమిక విద్యాశాఖా మంత్రి కె.పార్థసారధి విడుదల చేశారు.డీఎస్సీ లో సాధించిన మార్కులు మాత్రమే ప్రకటిస్తున్నామని, డీఎస్సీ, టేట్ మార్కులను కలిపి మెరిట్ జాబితా త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. అన్ లైన్ లో తప్పిదాల సవరణకు ఈ నెల 8 నుంచి 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి డీఎస్సి, టెట్కు ఒకే పరీక్ష టెస్ట్ (టీచర్ ఎలిజిబులిటీ అండ్ సెలక్షన్)నిర్వహిస్తామని మంత్రి వివరించారు. వచ్చే ఏడాది మరో డీఎస్సితో 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. 3వేలకుపైగా పీఈటీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మోడల్ స్కూళ్లలో పీజీ టీ, టీజీ టీ ఫలితాలు మాత్రమే విడుదల చేశారు.