అనంత రాజకీయాల్లోకి యువనేత పరిటాల శ్రీరామ్

అనంతపురం జిల్లాలోమళ్లీ తెలుగుదేశానికి ఈ జిల్లాలో మంచిరోజులు వచ్చాయి. కొత్తనాయకుడు తయారవుతున్నాడు. దివంగత నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాములు తరచూ తెలుగుదేశం కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. అతను పార్టీ పరంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా అప్పుడప్పుడు తల్లి వెంట కనబడుతూ, పర్యటనలు చేస్తున్నాడు. దీంతో అతడు తరచూ వార్తల్లో కనిపించడం మొదలుపెట్టాడు. తాజాగా చంద్రబాబు అనంతపుం జిల్లా నుంచి మొదలుపెట్టిన “వస్తున్నా మీకోసం” పాదయాత్రతో ఊపుమీదున్న తెలుగుదేశం కొత్త ఉత్సాహాన్ని పొందింది. శనివారం పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో పర్యటించిన చంద్రబాబు పరిటాల కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడారు. ఈ పర్యటనలో పరిటాల సునీతతో పాటు పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. పైగా, యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు ఆహ్వానం కూడా అందుతోంది. ఈ విషయమై చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్ రాజకీయ ప్రవేశం గురించి సునీత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల ప్రకారం, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, ప్రస్తుతం పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె స్పస్టంచేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.