కేజ్రీవాల్ తను హిట్లర్ ననుకుంటున్నారు : దిగ్విజయ్ సింగ్

 

కేజ్రీవాల్ హిట్లల్ లా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేజ్రీవాల్ కి సామాజిక పోరాటం చేస్తున్న కార్యకర్తగా పేరుండేదని, ఇప్పుడు పూర్తిగా స్వలాభంకోసం పాకులాడుతున్న వ్యక్తిగా ముద్రపడిపోయిందని తీవ్రంగా విమర్శించారు. “పౌర సమాజ ఉద్యమంలో మీ మాజీ సహచరుడు ఐఎఎస్ వై.పి.సింగ్ మిమ్మల్ని హిట్లర్ గా పేర్కొన్నాడు. ఆ పోలిక సబబే అనిపిస్తోంది.” అంటూ దిగ్విజయ్ కేజ్రీవాల్ కి ఓ లేఖ కూడా రాశారు. అరుణ్ రాయ్ తో , కిరణ్ బేడీతో, అన్నా హజారేతో తెగతెంపులు చేసుకున్నప్పుడే కేజ్రీవాల్ మీద స్వార్ధపరుడనే మచ్చపడిపోయిందని, జనం అంతా గమనిస్తూనే ఉన్నారని దిగ్విజయ్ ఆ లేఖలో వ్యాఖ్యలు చేశారు. జాతీయ సలహామండలిలో సభ్యుడి పదవికి తన పేరు సిఫారసు చేయమని కేజ్రీవాల్ తనని కోరారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ విషయంలో అన్నా హజారేనికూడా తనదారిలోకి తెచ్చుకునేందుకు కేజ్రీవాల్ విశ్వప్రయత్నం చేశారని కామెంట్ చేశారు దిగ్విజయ్..

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.