అన్నాహజారే టీమ్ లో కొత్త సభ్యులు
posted on Oct 20, 2012 @ 11:31AM
జన్ లోక్ పాల్ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని అన్నా హజారే నిర్ణయించారు. ఇందుకోసం తన బృందాన్ని విస్తరించే ఏర్పాట్లను మొదలుపెట్టారు. మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ తో పాటు మరికొందరు ప్రముఖుల్నికూడా తన బృందంలోకి ఆహ్వానించేందుకు సామాజిక శాస్త్రవేత్త అన్నా హజారే అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. రాలేగావ్ సిద్ధిలో ఈ విషయమై జరిగిన చర్చల్లో కిరణ్ బేడీ ప్రథానపాత్రను పోషించారు. ఉద్యమంకోసం ప్రత్యేక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని, రాలేగావ్ సిద్ధిలో ట్రస్ట్ కి ప్రత్యేక భవనం నిర్మించాలని అన్నా బృందం నిర్ణయించింది. వీకేసింగ్ తోపాటు, పీవీ రాజగోపాల్, రాజేందర్ సింగ్, మాజీ ఐపిఎస్ ఓం ప్రకాష్ సింగ్ తదితరులను తన బృందంలో చేర్చుకోవాలని అన్నా హజారే గట్టిగా అనుకుంటున్నారని సమాచారం.