అన్నాహజారే టీమ్ లో కొత్త సభ్యులు

 

జన్ లోక్ పాల్ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని అన్నా హజారే నిర్ణయించారు. ఇందుకోసం తన బృందాన్ని విస్తరించే ఏర్పాట్లను మొదలుపెట్టారు. మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ తో పాటు మరికొందరు ప్రముఖుల్నికూడా తన బృందంలోకి ఆహ్వానించేందుకు సామాజిక శాస్త్రవేత్త అన్నా హజారే అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. రాలేగావ్ సిద్ధిలో ఈ విషయమై జరిగిన చర్చల్లో కిరణ్ బేడీ ప్రథానపాత్రను పోషించారు. ఉద్యమంకోసం ప్రత్యేక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని, రాలేగావ్ సిద్ధిలో ట్రస్ట్ కి ప్రత్యేక భవనం నిర్మించాలని అన్నా బృందం నిర్ణయించింది. వీకేసింగ్ తోపాటు, పీవీ రాజగోపాల్, రాజేందర్ సింగ్, మాజీ ఐపిఎస్ ఓం ప్రకాష్ సింగ్ తదితరులను తన బృందంలో చేర్చుకోవాలని అన్నా హజారే గట్టిగా అనుకుంటున్నారని సమాచారం.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.