దీపం పథకానికి ఊరట
posted on Oct 24, 2012 @ 2:47PM
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేసింది. దాని ప్రభావం దీపం పథకంకింద సిలిండర్లు పొందినవాళ్లపై కూడా పడింది. ఈ సబ్సిడీభారాన్ని కొంతవరకూ భరించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. కేంద్రం సబ్సిడీపై సంవత్సరానికి కేవలం ఆరు సిలిండర్లుమాత్రమే ఇకపై ఇస్తుంది. దీనికి తోడుగా మరో మూడు సిలిండర్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నాలుగోతేదీనుంచి మార్చ్ 31వ తేదీవరకూ అందరికీ మూడు సిలిండర్లుమాత్రమే వస్తే దీపం పథకం లబ్ధిదారులకు మాత్రం ఆరు సిలిండర్లు వస్తాయి. మామూలు వినియోగదారులతో పోలిస్తే దీపం పథకం లబ్ధిదారులకు డబుల్ బొనాంజా అన్నమాట.