ఆర్మీ లెక్కల్లో భారీ అవకతవకలు

రక్షణశాఖ అంతర్గత ఆడిట్ లో ఆర్మీ.. ఇష్టంవచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుబారా చేసినట్టు బయటపడింది. కేవలం మూడేళ్లలో వందకోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వెలుగుచూసింది. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ సహా ఆరుగురు కీలక ఉన్నతాధికారులు ప్రజాధనాన్ని దుబారా చేసినట్లు ఆడిట్‌లో వెల్లడైంది. 2009 - 2011 మధ్య ఆర్మీకి అవసరమైన పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయడంలో వీళ్లు నిబంధనల్ని ఉల్లంఘించారని ఆడిట్ లో తేలింది. కంప్ట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆడిట్ నివేదికల ప్రకారం బిక్రమ్‌సింగ్ , ఇతర ఆర్మీ అధికారులు ఈస్టర్న్, నార్తర్న్ ఆర్మీ కమాండ్లకు నేతృత్వం వహిస్తున్నప్పుడు పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా చైనాకి చెందిన కమ్యూనికేషన్ పరికరాలను, ఇతర సామగ్రిని భారీ ధరలకు కొనుగోలు చేయడం ద్వారా ప్రజాధనాన్ని దుబారా చేసినట్లు వెల్లడైంది. ఆర్మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ కాస్త గట్టిగానే స్పందించారు. రక్షణ శాఖ అనుమతి లేనిదే కమాండర్లు కొనుగోళ్లు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.