కసబ్ కి ఉరే సరన్న షిండే
posted on Oct 24, 2012 @ 2:33PM
ముంబైపై ఉగ్రవాదుల దాడిలో పట్టుబడ్డ పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ తనకి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ముంబై దాడిలో నిర్దాక్షిణ్యంగా భారతీయ పౌరుల్ని కాల్చి చంపిన కసబ్ కి ఉరే సరైన శిక్షని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడుతోంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని నేరుగా రాష్ట్రపతికి లేఖలో పంపారు కేంద్ర హోంమంత్రి సుసీల్ కుమార్ షిండే. కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ని హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. మామూలుగా క్షమాభిక్ష తిరస్కరణ పిటిషన్ ని రాష్ట్ర పతికి పంపడానికి హోంశాఖ కాస్తోకూస్తో సమయం తీసుకుంటుంది. కానీ కసబ్ విషయంలో మాత్రం అలాంటి జాప్యం అనవసరమని షిండే భావించారు. మహారాష్ట్ర గవర్నర్ నోట్ రాయగానే వెంటనే కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ని అనుమతించరాదని కోరుతూ ఫైల్ ని రాష్ట్రపతికి పంపించారు. 166మందిని చంపి, 300 మందిని గాయపరిచిన ముంబై ఉగ్రదాడికేసులో కసబ్ కి సుప్రీంకోర్ట్ ఉరిశిక్షని ఖరారు చేసింది.