కసబ్ కి ఉరే సరన్న షిండే

ముంబైపై ఉగ్రవాదుల దాడిలో పట్టుబడ్డ పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ తనకి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ముంబై దాడిలో నిర్దాక్షిణ్యంగా భారతీయ పౌరుల్ని కాల్చి చంపిన కసబ్ కి ఉరే సరైన శిక్షని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడుతోంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని నేరుగా రాష్ట్రపతికి లేఖలో పంపారు కేంద్ర హోంమంత్రి సుసీల్ కుమార్ షిండే. కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ని హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. మామూలుగా క్షమాభిక్ష తిరస్కరణ పిటిషన్ ని రాష్ట్ర పతికి పంపడానికి హోంశాఖ కాస్తోకూస్తో సమయం తీసుకుంటుంది. కానీ కసబ్ విషయంలో మాత్రం అలాంటి జాప్యం అనవసరమని షిండే భావించారు. మహారాష్ట్ర గవర్నర్ నోట్ రాయగానే వెంటనే కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ని అనుమతించరాదని కోరుతూ ఫైల్ ని రాష్ట్రపతికి పంపించారు. 166మందిని చంపి, 300 మందిని గాయపరిచిన ముంబై ఉగ్రదాడికేసులో కసబ్ కి సుప్రీంకోర్ట్ ఉరిశిక్షని ఖరారు చేసింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.