పాదయాత్రలో సెంచరి పూర్తి చేసిన చంద్రబాబు
posted on Oct 8, 2012 @ 10:34AM
చంద్రబాబు పాదయాత్రలో ఒక మైలురాయి పూర్తి చేశారు. రెండు వేల కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో ఈయన ఆదివారం వంద కిలోమీటర్లు పూర్తి చేశారు. అనంతపురం నియోజకవర్గ పరిధిలో ఇది పూర్తయింది. ”వస్తున్నా మీకోసం” అంటూ భద్రత గురించి కూడా భయం లేకుండా చంద్రబాబు అందరితో మమేకం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం కంబదూరు మండలం కొత్తూరు గ్రామం చేరుకోవడంతో వంద కిలోమీటర్లు పూర్తయింది. బాబు పేరూరు డ్యాంను పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడారు. అసమర్థం ప్రభుత్వ నిర్ణయాలతో వర్షాలు వచ్చినా చెరువులు, డ్యాములు ఎండిపోయిన దుస్థితి అని ఆవేదన చెందారు. ఇలాంటి పాలనకు చెక్ పెట్టండి. సుభిక్ష రాష్ట్రం కావాలంటే సుపరిపాలన కావాలి. అందుకు తెలుగుదేశం అధికారంలోకి రావాలని బాబు వ్యాఖ్యానించారు.