అమ్మాయిని పిలిచి గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ
posted on Oct 8, 2012 @ 12:25PM
16 ఏళ్ళ అమ్మాయిని తన ఇంటికి రమ్మని పిలిచి ముగ్గురు యువకులతో గ్యాంగ్ రేప్ చేయించిన సంఘటన హర్యానాలో జరిగింది. మిను అనే మహిళ తన పక్కింటిలో ఉంటున్న అమ్మాయిని తన ఇంటికి రమ్మని పిలవడంతో బాధితురాలు అక్కడికి వెళ్ళింది. అప్పటికే మిను ఇంటిలో అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న నవీన్, సంజీవ్, ప్రదీప్ లు తను ఆ ఇంటిలోకి రాగానే ఆమె పై దాడి చేసి బలవంతంగా రేప్ చేశారు. ఆమెకు జరిగిన సంఘటను తట్టుకోలేకపోయిన అమ్మాయి తనపై కిరోసిన్ పోసుకొని అంటించుకుంది. బాధితురాలను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆమె చెప్పిన కథనం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకులను అరెస్ట్ చేయగా, మరొకతను పరారిలో ఉన్నాడు. హర్యానాలో రోజురోజుకి పెరుగుతున్న అత్యాచారాలపై మానవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.