బాబు పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు
posted on Sep 24, 2012 @ 5:49PM
మహాత్మాగాంధీ పుట్టిన రోజు కంటే మంచి రోజు లేదని, అందుకే రాష్ట్రంలో పాదయాత్రను అక్టోబర్ 2నుంచి ప్రారంభించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ఎన్టీరామారావు ప్రాతినిథ్యం వహించిన అనంతపురం జిల్లా, హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. 'మీకోసం...వస్తున్నా'' అనే పాదయాత్ర పేరు ఖరారు చేసినట్లు తెలిపారు. బాబు పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. టిడిపి తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిని ప్రజలకు తెలియజేస్తామని, బాబుకు విల్ పవర్ ఉందన్నారు.