తెలంగాణ మార్చ్ వల్ల కిరణ్ కుమార్ రెడ్డికే లాభం

 

తెలంగాణ మార్చ్ కోసం కోదండరామ్ తెగ ఊగిపోయారు. ఎలాగైనా మార్చ్ ని విజయవంతం చేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరారు. మార్చ్ కి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుకూడా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా మ్యానేజ్ చేయగలిగింది. గత అనుభవాల్ని దృష్టిలోపెట్టుకుని పోలీసులు పక్కా వ్యూహంతో ఆందోళనకారుల్ని కట్టుదిట్టం చేయగలిగారు. ముందునుంచీ మార్చ్ కి వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ ఈ విషయంలో సంతృప్తిగానే ఉన్నా తనకి పెద్దగా ఒరిగిందేం లేదు. మరి తెలంగాణ మార్చ వల్ల లాభపడిందెవరు? నూటికి నూరు శాతం కిరణ్ కుమార్ రెడ్డే.. అని ఈ ప్రశ్నకి సమాధానం అశేష తెలుగు ప్రజానీకంనుంచి గట్టిగా వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమం పేరుతో గతంలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాల విధ్వంసం ఎపిసోడ్ ని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమేకాక ఓ పద్ధతిలో ముందుకెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి.. మార్చ్ తూతూమంత్రంగా ముసిగిపొయ్యేలా చేయగలిగారని కాంగ్రెస్ వర్గాలు బాహాటంగా చెప్పుకుంటున్నాయ్. దీనివల్ల అధిష్ఠానం దృష్టిలో కిరణ్ కి మంచి మార్కులేపడ్డాయి. లా అండ్ ఆర్డర్ చేయిజారిపోయిందన్న వాదనలకు ఈ మార్చ్ ని కంట్రోల్ చేయడంద్వారా కిరణ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టగలిగారని సోనియాతోపాటు ఢిల్లీ పెద్దలంతా భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఊపునే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలవరకూ కిరణ్ సీటుకి ఢోకా లేదని హస్తినలో పెద్దలు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎన్నిరకాల విశ్లేషణలు ఇచ్చినా, ఎన్నిరకాలుగా రాజకీయ సమీకరణాలగురించి అంచనాలు గుప్పించినా తెలుగువన్ డాట్ కామ్ మాత్రం ముందునుంచీ కచ్చితమైన విశ్లేషణని అందిస్తోంది. 2014 ఎన్నికలవరకూ కిరణ్ కుర్చీకి వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలుగువన్ డాట్ కామ్ ముందునుంచీ చెబుతూనే ఉంది.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.