చంద్రబాబు విజయయాత్ర

 

అనుకున్న విధంగానే హిందూపూర్ నుంచి చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు పాదయాత్ర “వస్తున్నా మీకోసం” విజయవంతం కావాలని ఊరూరా, వాడవాడలా అభిమానులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. హిందూపూర్, రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో పాదయాత్రని పూర్తిచేసుకున్న చంద్రబాబు కళ్యాణదుర్గం అనే కంచుకోటలో ప్రవేశించారు. మంత్రి రఘువీరారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రని చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. కుర్లపల్లి క్రాస్ నుంచి యాత్ర ప్రారంభం. కదిరిదేవరపల్లి, ములకనూరు, ములకనూరు మిట్ట, దాసంపల్లి, బోయలపల్లి, కానక్కపల్లి, కురుబరహళ్లి క్రాస్, నారాయణపురం క్రాస్, యర్రంపల్లి క్రాస్ కల్యాణదుర్గం పాదయాత్రలో మజిలీలు. బోయలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్. నిజానికిది ఓ రకంగా ముందస్తు ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో కోల్పోయిన పట్టుని తిరిగి సంపాదించుకునేందుకు చంద్రబాబు చేపట్టిన విజయయాత్ర ఇదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.