కాగ్ నివేదిక తప్పులతడకంటున్నప్రథాని
posted on Aug 28, 2012 @ 10:00AM
గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్నే తాము అనుసరించామని, బొగ్గు కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రథాని అంటున్నారు. బిజెపి కావాలని తమపై బురదజల్లుతోందని యూపీఏ ఎదురుదాడి చేస్తోంది. కాగ్ నివేదికను తప్పులతడకగా అభివర్ణించడం హాస్యాస్పదమని ఆ పార్టీ మండిపడుతోంది. బొగ్గు కుంభకోణంపై ఉభయసభలూ అట్టుడికిపోతున్నాయి. ప్రథాని ప్రకటన చేసినప్పటికీ బిజెపి శాంతించడం లేదు. మన్మోహన్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. సభలో ప్రథాని ప్రకటన చేసేటప్పుడుకూడా బిజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. పోడియందగ్గరికి వచ్చి పెద్దపెట్టున నినాదాలు చేశారు. అకాలీదళ్ సభ్యులుమాత్రం మౌనం వహించారు. ఎస్పీ, బిఎస్పీ, ఆర్జేడీ, వామపక్షాల సభ్యులు సీట్లలోనే కూర్చుండిపోయారు. బిజేపీ సభ్యులు ఎంతకీ శాంతించకపోవడంతో సోమవారం.. సభ వాయిదాపడింది.