ఆస్ట్రేలియాను చిత్తు చేసిన విండీస్

 

 

టి-20 ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు కరీబియన్ జట్టు వెస్టిండీస్ షాకిచ్చింది. విధ్వంసక వీరులు క్రిస్ గేల్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్, కీరన్ పొలార్డ్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38, డ్వెన్ బ్రావో 31 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37 ధాటికి శుక్రవారమిక్కడ ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో వెస్టిండీస్ 74 పరుగులతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక టోర్నీలో సూపర్ ఫామ్‌లో అదరగొడుతూ వచ్చిన కంగారూలు. ఫైనల్ రేసులో బోల్తా పడ్డారు.


 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 16.4 ఓవర్లలో 131 పరుగులకే చేతులెత్తేశారు. కెప్టెన్ జార్జి బెయిలీ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 మినహా ఎవరూ రాణించలేదు. రవి రాంపాల్ 3/16, పొలార్డ్ 2/6, సునీల్ నరైన్ 2/17, శామ్యూల్ బద్రీ 2/27 ఆసీస్ పతనాన్ని శాసించారు. అంతకు ముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ పూర్తి ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో బౌండ్రీలు 13, సిక్స్‌ల 14 రూపంలో విండీస్‌కు 136 పరుగులొచ్చాయి. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో విండీస్ శ్రీలంకతో తలపడనుంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.