ఆంధ్రాయూనివర్సిటీలో మెస్ చార్జీల కలకలం
posted on Oct 9, 2012 @ 3:05PM
మెస్ చార్జీల్ని వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఆరుబైటే వర్సీటీ పరిపాలనా భవనం ఎదుట రోడ్డుమీద పడుకుని విద్యార్ధులంతా నిరసన తెలుపుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీల్ని పెంచకపోతే తాము ఎలా స్థిమితంగా చదువుమీద దృష్టిపెట్టగలమని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులమీద పెట్టే పెట్టుబడి దేశాభివృద్ధికి పెట్టే పెట్టుబడి అన్న విషయాన్ని యూనివర్సిటీ వర్గాలు, ప్రభుత్వాలు గుర్తించాలని ఆందోళనకు దిగిన విద్యార్ధులు కోరుతున్నారు. యూనివర్సీటీ పాలకవర్గం మెస్ చార్జీల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేవరకూ తాము ఆందోళనను విరమించే ప్రశ్నేలేదని స్టూడెంట్స్ తెగేసి చెబుతున్నారు. తమను చులకన చేసి మాట్లాడిన రిజిస్ట్రార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలనికూడా విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.