దేశంలో ఏపీయే నంబర్ వన్.. పెట్టుబడులతో తరలిరండి.. లోకేష్
posted on Oct 24, 2025 @ 2:15PM
దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఏపీ రెండో స్థానంలో ఉంది.. కానీ అతి త్వరలోనే నంబర్ వన్ స్థానినికి చేరుకుంటుంది. ఈ మాట తన ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ అక్కడి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో అన్న మాట. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులతో తరలిరావాలని నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా ట్రేడ్ అఅండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో మెల్ బోర్న్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టడీ మెల్బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులకు 2029 నాటికి ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు లీప్ పేరుతో సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా తాము 15 రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పిన ఏపీ ఐటీ మంత్రి.. వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్ వన్ అవుతామని గట్టిగా చెప్పారు. ఏపీతో చేతులు కలిపి మీ ప్రాజెక్టులను సక్సెస్ చేసుకోవాలని చెప్పారు. అలాగే విశాఖలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.
కాగా సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ను ఒక స్టార్టప్ స్టేట్ గా అభివర్ణించారు. చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్న ఆయన ఏపీ కేవలం ఎంవోయూలు కుదుర్చుకోవడంతో సరిపెట్టదనీ, ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషి చేస్తుందని ఉదాహరణలతో సహా వివరించారు. ఒక సారి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించుకుని మాతో చేతులు కలిపితే.. అది ఇక ఎంత మాత్రం కేవలం మీ ప్రాజెక్టుగా ఉండదనీ, అది మన ప్రాజెక్టు అవుతుందని అన్నారు.