శాసనసభ నిరవధిక వాయిదా

శాసనసభ వర్షాకాల సమావేశాలు తొలి రోజు నుంచి చివరి రోజువరకు వాయిదాలతో ముగిశాయి. శాసనసభ సమావేశాల్లో ఏ ఒక్క సమస్యపై కూడా చర్చలు జరగలేదు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ఆఖరి రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. వివిధ పార్టీలు పలు అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పోడియం వద్ద దూసుకెళ్లి ఫ్లకార్టులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి విద్యుత్‌పై చర్చకు స్పీకర్ అనుమతించినప్పటికీ సభ్యుల్లో మార్పు లేకపోవడంతో సభను మరో గంటపాటు వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం టీఆర్ఎస్ నేతలు స్పీకర్ పోడియం వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. నరసనలు సద్దుమణగకపోవడంతో సభను నివధికంగా వాయిదా వేశారు. అయితే రైతు సమస్యలపై చర్చ చేపట్టనందుకు తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ శాసనసభలో ఉరితాడు ప్రదర్శించి నరసన తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.