ఆర్థిక సమ్మేళనంలో ప్రధానికి చేదు అనుభవం

 

ప్రధాని మన్మోహన్ సింగ్ కి శనివారం చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆర్థిక సమ్మేళనంలో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని, న్యాయవాదిగా గుర్తించారు. చిల్లర వర్తంలోకి ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చొక్కా విప్పి నిరసన తెలిపిన 33 ఏళ్ల సంతోష్ కుమార్ సుమన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక రక్షణ దళానికి చెందిన గార్డులు తుగ్లక్ రోడ్డులోని పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అందరిపై ఉందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలపై సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.