ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు మూడు కోట్లు

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఓ పత్రిక కథనం ప్రకారం ఏపీలో నలుగురు మంత్రులు, 38మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇసుక మాఫియాలో భాగస్వామ్యులుగా ఉన్నారని, కిందిస్థాయి నేతలైతే వేలల్లో ఉంటారని తెలిపింది. ఉభయగోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ, వైసీపీ నేతలు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారని రాసుకొచ్చింది. ఒక్కో ఎమ్మెల్యే నెలకు మూడు కోట్లు సంపాదిస్తున్నారని, ఏడాదికి సగటున 30కోట్లు వెనకేస్తున్నారని లెక్కగట్టారు. ఇప్పటివరకూ 2వేలకోట్ల రూపాయలకు పైగా దోచేశారని, ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేసింది.  ఇసుక వ్యాపారంతో షార్ట్ టైమ్ లో కోట్లు సంపాదిస్తున్నారని, అందుకే అడ్డొచ్చిన అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారని ఆ పత్రిక పేర్కొంది. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి కూడా అలాంటిదేనని రాసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇసుక మాఫియాను అరికట్టలేకపోతున్నామని వ్యాఖ్యానించారంటే సాండ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు, 2019 ఎన్నికల్లో ఇసుక డబ్బే గెలుపోటములను నిర్దేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.,

Teluguone gnews banner