విమలక్క అరెస్ట్ ను ఖండించిన ఎర్రబెల్లి

విమలక్క అరెస్ట్‌పై పలు సంఘాల నేతలు నిరసన వ్యక్తపరిచారు. టీయూఎస్ నేతలు, టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి, అరుణోదయా సమాఖ్య, టీ.జేఎసీ నేతలు, కేకే తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే దిలీప్ కుమార్ హెచ్చరించారు. ఈ సమయంలో విమలక్కను అరెస్ట్ చేయడం తెలంగాణవాదులను రెచ్చగొట్టడమే అని కేకే పేర్కొన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ధ్వంసం కేసులో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్కతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివిద సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు ముందు విమలక్క అరెస్ట్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విమలక్క స్వయంగా తామే విగ్రహాన్ని ధ్వంసం చేశామని ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.