ఇంగ్లాండ్ ను ఆటాడుకున్న భారత స్పిన్నర్లు

 

టి-20 ప్రపంచ కప్ గ్రూప్- ఎ చివరి మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్ ను ఓ ఆటాడుకుంది. ఇంగ్లాండ్ పై 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి 14.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలారు. అంతర్జాతీయ టి-20ల్లో ఇంగ్లండ్‌కిదే అత్యల్ప స్కోరు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ (4/12) ఏడాది తర్వాత ఘనంగా రీ ఎంట్రీ ఇ చ్చాడు. చావ్లా (2/13), ఇర్ఫాన్ (2/17) అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో బ్రాడ్‌సేన పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టులో కీస్వెట్టర్ 35పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. అంతకుముందు టాస్ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన పూర్తి ఓవర్లలో నాలుగు వికెట్లకు 170 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 55 పరుగులు చేయగా, గంభీర్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 45, విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులతో దూకుడుగా ఆడారు. ఫిన్ రెండు వికెట్లు తీయగా, స్వాన్ 1వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.