రాబర్ట్‌ వాద్రాపై కేజ్రీవాల్ ఫైర్

రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్న సామాజిక కార్యకర్త, మాజీ ఐఏఎస్ అరవింద్ కేజ్రీవాల్ కదన రంగంలోకి దిగారు. ప్రధాన ప్రత్యర్థిపై పోరాటానికి మిగిలిన వారికి భిన్నమైన ఎత్తుగడను ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై ఆయన గురి పడింది. వాద్రా అక్రమాస్తుల్ని ఎలా కూడబెట్టిందీ కేజ్రివాల్ సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరు మోసిన డీఎల్ఎఫ్ సంస్థ వాద్రాకు అతి తక్కువ ధరకు అత్యంత ప్రధానమైన భూమిని ఇవ్వడమే కాకుండా వడ్డీ లేని రుణం ఇచ్చిందని, ఆ ఆస్తి విలువ 300 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. వాద్రాకు ఆ సంస్థ 50 లక్షల రూపాయలకే ఈ ఆస్తులన్నీ సమకూర్చి పెట్టిందని కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. వాద్రా సంపద విలువ మూడేళ్లలో 600 రెట్లు పెరిగిందని వారు చెప్పారు. కేజ్రివాల్ మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. దేశంలోని అత్యంత అవినీతిపరులైన ఇద్దరు రాజకీయ నాయకుల గుట్టును శనివారం విప్పుతామని ఇటీవల కేజ్రీవాల్ చెప్పారు. అయితే, ఒక రాజకీయ నాయకుడిని గుట్టును ఒక రోజు ముందే శుక్రవారం విప్పేశారు. మరో రాజకీయ నాయకుడి ఆస్తుల వివరాలను అక్టోబర్ 10వ తేదీన వెల్లడించే అవకాశాలున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.